హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో చిరుత దాడిలో లేగదూడ మృతి చెందింది. ఇందల్వాయి మండలం మెంగ్యానాయక్ తండాలో గురువారం ఈ ఘటన చోటు చేసుకున్నది. స్థానికులు సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. చిరుతపులి సంచారంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఒంటరిగా పొలాల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. చిరుత బారి నుంచి తమను కాపాడాలంటూ స్థానికులు ఫారెస్ట్ అధికారులను కోరుతున్నారు.