న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రయాణాలకు వీలుగా కరోనా ఆంక్షలను సడలించనున్నామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. వచ్చేనెల నుంచి రాకపోకలకు అనుమతిస్తామని చెప్పారు. అలాగే భారత్ తయారీ కొవిషీల్డ్, చైనా తయారీ సినోవాక్ వ్యాక్సిన్లను గుర్తిస్తున్నామని వెల్లడించారు. ఈ వ్యాక్సిన్లను తీసుకున్న ఇతర దేశాల ప్రయాణికులనూ తమ దేశంలోకి అనుమతించనున్నట్టు పేర్కొన్నారు.