ముంబై: ముంబైలో మళ్లీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో టెస్టింగ్ను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలో పాజిటివిటీ రేటు కూడా ఆరుకు చేరినట్లు బీఎంసీ ఓ ప్రకటనలో తెలిపింది. ముంబైలో రోజువారి కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఇక వానా కాలం సమీపిస్తున్న నేపథ్యంలో కోవిడ్ లక్షణాలు ఉన్న కేసుల సంఖ్య పెరుగుతుందని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. మంగళవారం ముంబైలో కొత్తగా 506 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి ఆరవ తేదీ నుంచి ఇదే అత్యధిక సంఖ్య. ముంబైలో ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో వంద శాతం కేసులు పెరిగినట్లు నిర్ధారణకు వచ్చారు.