న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏండ్ల మధ్య వయసుగల పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్ ( Covid vaccination ) ఇవాళ ప్రారంభమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పిల్లలకు వ్యాక్సిన్లు ఇస్తున్నారు. 2022, జనవరి 3 నుంచి దేశమంతటా 15-18 ఏండ్ల మధ్య వయసు పిల్లలకు వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్లు గత డిసెంబర్ 25న ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఆ మేరకు ఇవాళ కొవిడ్ వ్యాక్సినేషన్ మొదలైంది.
కొత్త వ్యాక్సిన్లు తీసుకుంటున్న టీనేజ్ గ్రూప్ పిల్లలందరికీ కొవాగ్జిన్ టీకాలు ఇవ్వాలని, అందుకు సరిపడా అదనపు కొవాగ్జిన్ డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపుతామని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఇటీవల ప్రకటించారు.