న్యూఢిల్లీ : కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి కంటే భారతదేశంలో టీకా రేటు చాలా ఎక్కువగా ఉన్నది. కేవలం రెండు నెలల వ్యవధిలో భారతదేశం మొత్తం మీద కొవిడ్-19 కేస్లోడ్ కంటే 5 కోట్లకు పైగా మోతాదుల టీకాలు అందించారు. గత ఏడాదిలో మొత్తం కొవిడ్-19 కేసులు 1.17 కోట్లుగా ఉండగా.. సుమారు 137 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో మంద రోగనిరోధక శక్తి ఇంకా చాలా దూరంలో ఉన్నదని ఈ రెండు గణాంకాలు చెప్తున్నాయి.
ఇది కొవిడ్-19 వ్యాప్తికి భారీ అవకాశాన్ని ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. రెండవసారి వచ్చిన సందర్భంలో కరోనా వైరస్ కొవిడ్-19 ను మరోసారి భయంకరమైన రేటుతో వ్యాప్తి చేస్తున్నదని వారంటున్నారు.
కరోనావైరస్ ఇన్పెక్షన్ పునరుత్పత్తి రేటు 2020 మార్చి-ఏప్రిల్ నుంచి అత్యధిక స్థాయికి చేరుకున్నదని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ రేటును ఆర్-నాట్ అని పిలుస్తారు. కరోనా సోకిన రోగి ఎంత మంది ఆరోగ్యకరమైన వ్యక్తులకు ఈ వ్యాధిని వ్యాప్తి చేయగలదో ఈ ఆర్-నాట్ లేదా ఆర్-ఫ్యాక్టర్ తెలియజేస్తుంది.
భారతదేశంలో కొవిడ్-19 మహమ్మారి యొక్క సెకండ్ వేవ్లో ఆర్-ఫ్యాక్టర్.. ప్రస్తుతం 1.32గా ఉన్నది. దీని అర్థం ఒక కరోనా సోకిన వ్యక్తి ఈ వ్యాధికి సగటున 1.32 మంది ఆరోగ్యవంతులకు వ్యాప్తి చెందిస్తున్నాడు.
గత ఏడాది మార్చి 27 నుంచి ఏప్రిల్ 6 వరకు ఇది 1.83 గా ఉన్నది. ఆ తరువాత ఏప్రిల్ రెండో భాగంలో, మే మొదటి భాగంలో 1.23 కు పడిపోయింది. ఇది జూలైలో 1.16 వద్ద నిలిచింది. 2020 సెప్టెంబర్-2021 ఫిబ్రవరి మధ్య క్రియాశీల కేస్లోడ్ స్థిరమైన క్షీణతను చూసింది. ఆర్-నాట్ 1 కన్నా తక్కువకు వచ్చింది.
కరోనా సోకిన వ్యక్తి నుంచి వ్యాధిని ఎప్పుడూ పట్టుకోని జనాభాకు వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో చెబుతున్నందున.. మహమ్మారి నియంత్రణలో అధికారులకు ఆర్-నాట్ను నిర్ధారించడం చాలా ముఖ్యమైంది. ఈ సందర్భంలో కొవిడ్-19.. ఆర్-నాట్ 1 కంటే ఎక్కువగా ఉంటే.. కొత్త జనాభా సమూహాల్లో ఈ వ్యాధి పెరుగుతున్న రేటుతో విస్తరిస్తున్నదని అర్థం చేసుకోవాలి. ఆర్-నాట్ 1 కన్నా తక్కువగా ఉంటే.. దీని అర్థం వ్యాధి వ్యాప్తి తగ్గుతున్నది. కొంత కాలానికి కనిపించకుండా పోవచ్చు.
భారతదేశంలో కొవిడ్-19 మహమ్మారి యొక్క ఆర్-నాట్ లేదా ప్రాథమిక పునరుత్పత్తి రేటు దాని వక్రతను తిప్పికొట్టింది. మహమ్మారి పరిస్థితిలో ఏ ఒక్క కారకం అటువంటి తిరోగమనానికి దారితీయదు.
భారతదేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ రావడానికి కారణాలు అనేకం ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మాస్క్ ధరించకపోవడం, నిర్ణీత భౌతిక దూరం పాటించకపోవడం, శానిటైజేషన్ పట్ల అశ్రద్ధ చూపడం వంటివి ఉన్నాయి. పరిశుభ్రత ప్రోటోకాల్కు ప్రజలు కట్టుబడి ఉండకపోవడం వల్ల కూడా సెకండ్ వేవ్కు కారణమైందని నిపుణులు చెప్తున్నారు.
కరోనా వైరస్ ప్రోటోకాల్ను పాటించకపోవడం లేదా మరింత అంటువ్యాధికి గురికావడం వల్ల ఆర్-నాట్ను పునరుద్ధరించవచ్చు. దీనివల్ల మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇది మనందరికీ ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.
బెంగాల్ ఎన్నికలకు యూపీ పోలీసులు.. ఈసీకి టీఎంసీ లేఖ
బిట్ కాయిన్తో టెస్లా కారు కొనొచ్చు.. ఎలోన్ మస్క్ ట్వీట్
త్వరలో క్యాన్సర్ వ్యాధికి టీకా.. జర్మన్ శాస్త్రవేత్త దంపతుల దృష్టి
పరంబీర్ పిటిషన్ విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు
క్షయవ్యాధికి కారకాన్ని గుర్తించిన రాబర్ట్ కోచ్.. చరిత్రలో ఈరోజు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.