ఢిల్లీ : దేశ రాజధానిలో కొవిడ్ కేసులు తక్కువగానే నమోదవుతున్నాయని, పరిస్థితి నియంత్రణలో ఉందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అన్నారు. పాజిటివిటీ రేటు 0.4 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఆరు నెలల్లోపు ఏడు ఆసుప్రతుల్లో 6,800 కంటే ఎక్కువ ఐసీయూ పడకలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా ఢిల్లీలో ఆదివారం కొత్తగా 31 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధానిలో వరుసగా నాలుగో రోజూ మరణాలు నమోదు కాలేదని ప్రభుత్వం తెలిపింది. మరో వైపు కొవిడ్ కేసులు తగ్గుతూ వస్తుండడంతో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి దశల వారీగా పాఠశాలలను తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.