దేశంలో అస్పృశ్యత నిర్మూలన కోసం మహోద్యమాన్ని చేపట్టి దేశవ్యాప్తంగా ఉన్న దళితుల్లో సాంఘిక, విద్య, రాజకీయ చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్. సమాజంలో మనిషికి, మనిషికీ మధ్య ఉన్న తేడాలను రూపుమాపి, సర్వసమానత్వం కోసం కృషిచేసిన కారణజన్ముడు.
దేశంలో బ్రిటిష్ వారి బానిసత్వం నుంచి విముక్తి కోసం ఒకవైపు జాతీయోద్యమం సాగుతుంటే మరోవైపు సమాజంలో అట్టడుగు వర్గాల అభివృద్ధి, దళిత వర్గాల సముద్ధరణకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు అంబేద్కర్.
బాల్యం నుంచి ఎదుర్కొన్న వర్ణ వివక్ష ఆయనను విద్యకు దగ్గర చేసింది. ఆత్మబలంతో చదివి వర్ణవ్యవస్థను నిర్మూలించే దిశగా అడుగులు వేయాలని చిన్నతనంలోనే నిర్ణయించుకున్నారు. ఆ సంకల్పమే అంబేద్కర్ను న్యాయశాస్త్రంలో డాక్టరేట్ సంపాదించేలా చేసింది. వర్ణవివక్షను నిర్మూలించకుండా దేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఉపయోగం లేదని అంబేద్కర్ బలంగా విశ్వసించారు. ఆ దిశగానే దళితజనోద్ధరణే లక్ష్యంగా పనిచేశారు. ఆయన కనబరిచిన దార్శనికతతోనే దళిత గిరిజన బహుజన వర్గాలతో పాటు సకల జనులందరికీ ఆర్థిక, సామాజిక న్యాయం లభించింది. దేశాభివృద్ధికి చిన్న రాష్ర్టాల ఏర్పాటే శరణ్యమని నమ్మిన ఆయన రాజ్యంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 తెలంగాణ వంటి ఎన్నో రాష్ట్ర ష్ర్టాల ఏర్పాటుకు దోహదపడింది. తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ దేశం గర్వించదగిన రీతిలో 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయడం దేశానికే గర్వకారణం..
– డాక్టర్ సంగని మల్లేశ్వర్
98662 55355