బాలీవుడ్ కథానాయికలు కరీనాకపూర్, అమృత అరోరా కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షలో వారిద్దరికి పాజిటివ్గా తేలినట్లు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కరీనాకపూర్, అమృత అరోరా పలు పార్టీలకు హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఇద్దరిని కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేసుకోవాల్సిందిగా సూచించారు. గత వారం అనిల్కపూర్ తనయ రియాకపూర్ ఇంట్లో జరిగిన క్రిస్మస్ పార్టీలో మలైక అరోరా, కరిష్మాకపూర్లతో పాటు కరీనా, అమృత అరోరా పాల్గొన్నారు. అలాగే కరణ్జోహార్ ఇచ్చిన పార్టీకి అర్జున్కపూర్, అలియాభట్లతో పాటు వారు హాజరైనట్లు తెలిసింది. ప్రస్తుతం కరీనాకపూర్, అమృతఅరోరా ఇద్దరు హోమ్క్వారంటైన్లో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.