హైదరాబాద్ : వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కొవిడ్ పరీక్ష నిర్వహించగా కరోనా నెగటివ్గా రిపోర్ట్ వచ్చింది. ఉమ్మడి వరంగల్ పర్యటనలో మంత్రి వెంట ఉన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఆయన సతీమణి, జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి కి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వనపర్తి జిల్లాలో కరోనా టెస్ట్ చేయించుకోగా నెగటివ్ గా తేలింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు మంత్రి ఎర్రబెల్లి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు.
మంత్రి వెంట ఉన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఆయన సతీమణి , జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి కూడా ఉన్నారు. వారికి పాజిటివ్గా నిర్ధారణ కావడంతో మంత్రి నిరంజన్రెడ్డి కూడా పరీక్షలు చేయించుకున్నారు.