అమరావతి : అంతరిక్ష ప్రయోగాలకు కేంద్రంగా ఉన్న శ్రీహరి కోట షార్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇక్కడ రెండు రోజుల్లోనే 200 పైగా కేసులు నమోదు అయ్యాయి. నిన్న 142 మందికి నిర్ధారణ కాగా ఈ రోజు మరో 91 మందికి నిర్ధారణ అయ్యిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. సంక్రాంతి సెలవులకు ఊరికి వెళ్లి వస్తున్న వారికి వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తుండడంతో కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే షార్లో 50 శాతం హాజరుతో కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. దీంతో కరోనా కారణంగా అంతరిక్ష ప్రయోగాలు మరింత వాయిదా పడే అవకాశం భావిస్తున్నారు.
ఏపీలో నిన్న 38,055 మందికి పరీక్షలు నిర్వహించగా 6,996 మందికి కరోనా సొకింది . నలుగురు కరోనాతో మృతి చెందారు. ప్రసుత్తం రాష్ట్రంలో 36,108 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1, 534 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . విశాఖలో 1,263 , గుంటూరు జిల్లాలో 758, శ్రీకాకుళం జిల్లాలో 573 , అనంతపురం జిల్లాలో 462, ప్రకాశం జిల్లాలో 424 కరోనా కేసులు అత్యధికంగా నమోదయ్యాయి .