హైదరాబాద్, నవంబర్ 16: మురుగుప్పా గ్రూపునకు చెందిన కోరమాండల్ ఇంటర్నేషనల్.. వైజాగ్లో రూ.400 కోట్ల పెట్టుబడితో నూతన సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి కంపెనీ ఉన్నతాధికారులు ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులతో అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. భారత్ ఏటా 20 లక్షల టన్నుల సల్ఫ్యూరిక్ యాసిడ్ను దిగుమతి చేసుకుంటున్నదని, దిగుమతుల భారాన్ని తగ్గించడానికి ఈ నూతన యూనిట్ దోహదపడగలదని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ అన్నారు.