కోల్కతా: రెండు దశాబ్దాల అనంతరం హర్యానా జట్టు కూచ్ బిహార్ ట్రోఫీని ముద్దాడింది. నిరుడు వినూ మన్కడ్ ట్రోఫీని నెగ్గిన హర్యానా అదే ఉత్సాహంతో అండర్-19 ఫస్ట్ క్లాస్ దేశవాళీ టోర్నీ కూచ్ బిహార్ ట్రోఫీని చేజిక్కించుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో ముంబైని హర్యానా చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్లో కెప్టెన్ నిశాంత్ సిద్ధు (114), రోహన్ దేశ్వాల్ (101), సర్వేశ్ రోహిల్లా (100*) శతకాలతో హర్యానా 437 భారీ స్కోరు చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్లో ముంబై 303 రన్స్కు ఆలౌటైంది. మలి ఇన్నింగ్స్లో హర్యానా ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ముంబై రెండో ఇన్సింగ్స్ ఆడకుండానే మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం ఆధారంగా హర్యానాను విజేతగా ప్రకటించారు. దీంతో రెండోసారి కూచ్ బిహార్ చాంపియన్గా హర్యానా నిలిచింది.
తొలి ఇన్నింగ్స్: హర్యానా 122.2 ఓవర్లకు 437 ఆలౌట్ (నిశాంత్ 115, రోహన్ 101, సర్వేశ్ 100*; సూర్యాంశ్ 3/86).
ముంబై: 105.1 ఓవర్లకు 303 రన్స్కు ఆలౌట్ (రఘువంశీ 97, గర్వ్ సాంగ్వాన్ 5/41).
రెండో ఇన్నింగ్స్: ఆడకుండానే మ్యాచ్ డ్రా.