దుబాయ్: టీ20 ప్రపంచకప్ తుదిపోరులో రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్ జట్టు భారత్ ప్రయాణానికి సిద్ధమైంది. మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడేందుకు కివీస్ టీమ్ భారత్లో పర్యటించనుంది. టాపార్డర్ బ్యాటర్ కాన్వే ఈ టూర్కు దూరమయ్యాడు. సెమీస్ సందర్భంగా చేతిని గాయపర్చుకున్న కాన్వే.. పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో ఈ పర్యటనకు అందుబాటులో లేకుండాపోయాడు. ఆదివారం జరిగిన తుదిపోరులోనూ అతడు బరిలోకి దిగని విషయం తెలిసిందే. అయితే కాన్వే స్థానంలో కివీస్ బోర్డు మిచెల్కు జట్టులో చోటు కల్పించింది.