న్యూఢిల్లీ: జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేషన్(హెచ్ఎఫ్ఐ)లో వివాదానికి దారితీసిన అడ్మినిస్ట్రేటర్ నియామకానికి హర్యానా సోసైటీల రిజిస్ట్రార్ ముగింపు పలికారు. నియామకం అక్రమమని హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు జగన్మోహన్రావు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పదిరోజుల్లోగా సమస్య పరిష్కారించాలని హర్యానా రిజిస్ట్రార్కు న్యాయస్థానం సూచించింది. పూర్తిస్థాయి విచారణ జరిపి అడ్మినిస్ట్రేటర్ నియామకం చెల్లదని తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ప్రస్తుత కార్యవర్గం యాథవిధిగా తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. ఇదిలా ఉంటే శనివారం లక్నోలో జరిగిన భేటీలో తేజ్రాజ్సింగ్ను కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా డీకే సింగ్, హిమానియా సింగ్ నియమితులైనట్లు హెచ్ఎఫ్ఐ తెలిపింది. సమాఖ్యలో రాజకీయాలకు పూర్తిగా చరమగీతం పాడామని, ఇక నుంచి క్రీడాభివృద్ధి తప్ప రాజకీయాలకు తావు లేదని హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు జగన్ స్పష్టం చేశారు.