హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 11 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు కాంట్రాక్ట్ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్, రెసిడెన్షియల్ కాలేజీల జిల్లా, రాష్ట్రస్థాయి కాంట్రాక్ట్ ఉద్యోగ నాయకులు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిని కలిసి తమ తరఫున సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపాలని కోరారు. త్వరలో రాష్ట్రస్థాయి సభ ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతామని చెప్పారు. డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్, జూనియర్ కాలేజీ సంఘాల నాయకులు కనక చంద్రం, గాదె వెంకన్న, సురేశ్, రమణరెడ్డి తదితరులు పల్లాను కలిసినవారిలో ఉన్నారు.