హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని కోరుతూ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ కాంట్రాక్ట్ రాష్ట్ర (ఉథాట్స్) నేతలు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి శుక్రవారం విజ్ఞప్తి చేశారు. సుమారు 20 ఏండ్లుగా రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఓయూ, కేయూలతోపాటు అన్ని యూనివర్సిటీల్లో అత్యత్తమ ఫలితాలు రావడంలో తమ శ్రమ ఎంతో ఉన్నదని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో ఉథాట్స్ అధ్యక్షుడు బైరి నిరంజన్, కార్యదర్శి పరశురాం, వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్మ తేజ, శివారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ప్రేమయ్య, రాజేశ్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.