సంగారెడ్డి: జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతున్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్ట్లోకి 3,640 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1,316 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయంలో 17.203 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 29.91 టీఎంసీలు.