నర్సంపేట, నవంబర్ 14: కంచే చేను మేసిన చందాన కాపాడాల్సిన రక్షక భటుడే దారి తప్పి దొంగగా మారాడు. వరంగల్ జిల్లా నర్సంపేట పోలీస్స్టేషన్లో బైకును అపహరించిన కేసులో హెడ్కానిస్టేబుల్ను అరెస్ట్ చేశారు. నర్సంపేటలోని ఓ చెప్పుల దుకాణంలో ఇటీవల చోరీ జరిగింది. దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని, అతడి బైకును సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. కాగా, ఆ బైక్ను పోలీస్స్టేషన్లోని హెడ్కానిస్టేబుల్ రవీందర్ చోరీచేసి, ముత్యాలమ్మ తండాకు చెందిన రమేశ్కు విక్రయించాడు. స్టేషన్లో బైక్ మాయమవ్వడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలు పరిశీలించగా, ఆ వాహనం హెడ్కానిస్టేబుల్ రవీందర్ అపహరించినట్టు గుర్తించారు. రవీందర్ను అరెస్ట్ చేసినట్టు ఎస్సై రాంచరణ్ తెలిపారు.