సిటీబ్యూరో: ఈనెల 30న జరగనున్న 15వ ఎడిషన్ ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్- 2026 నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున నీట్-పీజీ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ప్రత్యమ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 11.30 గంటల వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కేబుల్ బ్రిడ్జి-ఐటీసీ కోహినూర్-మై హోమ్ అభ్రా-సీ గేట్ జంక్షన్-ఐకియా (మైండ్ స్పేస్ రోటరీ)-ట్రాన్స్ కో-ఎన్ సీబీ/బయోడైవర్సిటీ జంక్షన్-పిస్తా హౌస్-సౌత్ ఇండియా షాపింగ్ మాల్-గచ్చిబౌలి ఫె్లైఓవర్-ఇందిరానగర్-ఐఐఐటీ జంక్షన్ మీదుగా గచ్చిబౌలి స్టేడియం, హెచ్సీయూ రెండో గేట్ వరకు మారథాన్ సాగనున్నట్లు వెల్లడించారు.
10కే రన్ హైటెక్స్-మాదాపూర్ నుంచి ప్రారంభమై ఎన్ఏసీ మెయిన్ గేట్, ఖానామెట్ జంక్షన్, మెటల్ చార్మినార్ జంక్షన్, టెక్ మహీంద్రా, లెమన్ ట్రీ హోటల్, రాయదుర్గం మెట్రో స్టేషన్, ఐకియా అండర్పాస్ మీదుగా ప్రధాన మారథాన్ మార్గంలో కలుస్తుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.