న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఇవాళ ఈడీ ముందు రాహుల్ గాంధీ హాజరయ్యారు. అయితే భారీ ర్యాలీ తీస్తూ ఈడీ ఆఫీసుకు వెళ్లారు. దీన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ ధర్నా చేయడం లేదని, రాహుల్ గాంధీకి చెందిన రెండు వేల కోట్ల ఆస్తుల్ని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. నిరసన ప్రదర్శనలతో దర్యాప్తు సంస్థపై వత్తిడి చేస్తున్నారని, అక్రమ ఆస్తుల్ని కాపాడుకునేందుకు దర్యాప్తు సంస్థపై కాంగ్రెస పార్టీ వత్తిడి తెస్తోందని, చట్టం కన్నా ఎవరూ గొప్ప కాదు అని, రాహుల్ గాంధీ కూడా అంటూ మంత్రి ఆరోపించారు.
గాంధీ ఫ్యామిలీపై ఉన్న ఈడీ కేసు గురుంచి మీడియాకు ఆమె వివరించారు. అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ను 1930లో స్థాపించారు. వార్తాపత్రికను నడిపంచాలన్న ఉద్దేశంతో ఆ సంస్థను స్టార్ట్ చేశారు. ఆ సమయంలో ఆ పత్రికలో అయిదు వేల మంది స్వాతంత్య్ర సమరయోధులున్నారని, కానీ ఇప్పుడు ఆ సంస్థ గాంధీ ఫ్యామిలీ చేతుల్లోకి వెళ్లిపోయినట్లు మంత్రి స్మృతి తెలిపారు. పత్రిక ఓనర్షిప్ను ఒకే కుటుంబానికి ట్రాన్స్ఫర్ చేశామని, ఎందుకంటే ఆ పత్రికను రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా మార్చారని ఆమె అన్నారు.
ఇవాళ భోజన విరామానికి ముందు సుమారు 3 గంటల పాటు ఈడీ అధికారులు రాహుల్ గాంధీని విచారించారు.