పుణే : మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతావ్ (46) ఆదివారం కన్నుమూశారు. కరోనా, సైటోమెగలో వైరస్పై 23 రోజుల పాటు చేసిన సుదీర్ఘ పోరాటం తర్వాత ఆయన.. పుణెలోని ఆసుపత్రిలో మృతి చెందారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఏప్రిల్ 19న రాజీవ్ సతావ్ కరోనా లక్షణాలను కనిపించాయి. పరీక్షలు చేయడంతో 21న పాజిటివ్గా తేలింది. దీంతో ఆయన పుణెలోని జహంగీర్ హాస్పిటల్లో చేరారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వారం తర్వాత వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించగా కొంత వరకు కోలుకున్నారు.
ఆ తర్వాత మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకు తరలించారు. ఈ క్రమంలో ఆదివారం పరిస్థితి చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతిపై కాంగ్రెస్ పార్టీ, నేతలు సంతాపం ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి జై రామేశ్ రమేశ్, కేసీ వేణుగోపాల్, పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. రాజీవ్ సతావ్ మృతిపై కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ రోజు నేను యూత్ కాంగ్రెస్లో నాతో ప్రజా జీవితంలో మొదటి అడుగు వేసిన స్నేహితుడిని కోల్పోయాను’ అని ట్వీట్ చేశారు.