కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి పిలుపు
మునుగోడు, మార్చి 16 : ఉపాధిహామీ పథకం నుంచి తొలగించిన 7,600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను మానవతాదృక్పథంతో తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్టు ప్రకటించిన సీఎం కేసీఆర్కు క్షీరాభిషేకాలు చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డిని బుధవారం ఫీల్డ్ అసిస్టెంట్లు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము చేసిన విజ్ఞప్తికి స్పందించి ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లో చేర్చుకొన్న సీఎం కేసీఆర్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.