పానాజీ, మే 2: కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. బీజేపీ నేతృత్వంలోని 10 నుంచి 15 రాష్ట్ర ప్రభుత్వాలు కుప్పకూలుతాయని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక 10వ షెడ్యూల్ను సవరించి ఫిరాయింపులను నివారిస్తామని, పార్టీ మారిన వారిని అనర్హులుగా చేస్తామని చెప్పారు.
అలా చేయడం వల్ల పార్టీ మారిన వారు అనర్హులై, దొడ్డి దారిన అధికారం చేపట్టిన 10, 15 ప్రభుత్వాలు జూలై నాటికి పడిపోతాయన్నారు. కాగా, కర్ణాటకలోని సెక్స్ స్కాండల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పాస్పోర్టును రద్దు చేసి, అతడిని భారత్ రప్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పవన్ ఖేరా అన్నారు.