జెరూసలేం, ఫిబ్రవరి 7: పెగాసస్ స్పైవేర్తో పోలీసులు పలువురి ఫోన్ల హ్యాకింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై దర్యాప్తునకు కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు ఇజ్రాయెల్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఎలాంటి అనుమతి లేకుండా మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సహచరులు, పలువురు ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టుల ఫోన్లలోకి పోలీసులు పెగాసస్ స్పైవేర్ను పంపారని ఓ స్థానిక వార్తాపత్రిక నివేదించింది. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే.. చాలా తీవ్రమైనవని ప్రధాని నెఫ్తాలి బెన్నెట్ అభిప్రాయపడినట్టు ప్రజాభద్రత మంత్రి ఒమర్ బార్లేవ్ పేర్కొన్నారు.