కొల్లాపూర్, నవంబర్ 28: కృష్ణా జలాలు ఆకుపచ్చ రంగులోకి మారాయి. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని అమరగిరి నుంచి శ్రీశైలం రిజర్వాయర్ వరకు వారం రోజులుగా నీరు రంగు మారుతుంది. గతంలో ఎన్నడూ ఇలా నీళ్లు రంగు మారలేదని నదీతీర గ్రామాల ప్రజలు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా పరిసర ప్రదేశాల్లో ఉన్న ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు నదీలో కలవడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు అంటున్నారు. నీరు రంగు మారడంతో చేపలు మృతి చెందే ప్రమాదం ఉన్నదని జాలర్లు ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను నదిలోకి వదలకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.