రూ.ఐదు లక్షల ఆర్థికసాయం అందజేత
భీమదేవరపల్లి, అక్టోబర్ 17: సహోద్యోగి మృతితో తీవ్రంగా కలత చెందిన బ్యాచ్మేట్స్.. బాధిత కుటుంబానికి ఆపన్నహస్తం అందించారు. రూ.5 లక్షల ఆర్థికసాయం అందించి అండగా నిలిచారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రానికి చెందిన పిట్టల కిరణ్కుమార్ ఏఆర్ కానిస్టేబుల్గా కరీంనగర్లో విధులు నిర్వర్తించేవారు. అతను గత ఆగస్టు 2న రోడ్డు ప్రమాదంలో మరణించారు. కర్నూలులో అతనితోపాటు ట్రైనింగ్ చేసిన 2009 బ్యాచ్ రెండో బెటాలియన్ మిత్రులు, కరీంనగర్, కృష్ణా, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల మిత్రుల నుంచి రూ.3.50 లక్షలు, సివిల్ బ్యాచ్ నుంచి రూ.1.57 లక్షలు సేకరించారు. మొత్తం రూ.5.07 లక్షల నుంచి కిరణ్కుమార్ పిల్లలు సంయుక్త, యషిత పేర్లమీద సుకన్య సమృద్ధి యోజన పథకం కింద రూ.3 లక్షలు, కుమారుడు పిట్టల అయ్యాన్ సాయి పేరిట రూ. 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేసిన బాండ్ల ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ చేతుల మీదుగా ఆదివారం సీపీ కార్యాలయంలో కిరణ్కుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు.