హైదరాబాద్ : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలకు టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ 500 ట్యాబ్లెట్లు, 50 ల్యాప్టాప్లను విరాళంగా అందజేసింది. డిజిటల్ ఇన్క్లూజన్లో భాగంగా కాగ్నిజెంట్ వీటిని విరాళంగా ఇచ్చింది. మల్కాజ్గిరిలోని జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమం ద్వారా ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను బహూకరించింది. ఈ చర్య ద్వారా 9, 10వ తరగతి చదివే 500 మంది విద్యార్థులు, 50 మంది ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను అందజేసేందుకు కాగ్నిజెంట్ కోటి రూపాయలను కేటాయించింది.
విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో డిజిటల్ నైపుణ్యాలు పెంపొందే విధంగా కంపెనీ వాలంటీర్లు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కాగ్నిజెంట్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ హైదరాబాద్ ఆపరేషన్స్ శైలజా జ్యోసులా, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సీఈవో మయూర్ పంతాలా, మేడ్చల్ మల్కాజ్గిరి డీఈవో ఐ విజయా కుమారి, స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం. వీరేశం, తదితరులు పాల్గొన్నారు.