హిమాయత్నగర్,జనవరి5: ఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. ఎత్తు ప్రాంతమైన హిమాయత్నగర్ నుంచి వరద నీరు నారాయణగూడ ైప్లె ఓవర్ సమీపంలో నీరు వెళ్లే మార్గం సరిగ్గాలేక పోవడంతో రోడ్డుపైనే నీరు నిలిచేది. దీంతో ఆ దారి గుండా వెళ్లే వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడే వారు. ఈ సమస్యను గుర్తించిన స్థానిక కార్పొరేటర్ జి.మహాలక్ష్మి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్య పరిష్కారం కోసం పైపులైన్ వ్యవస్థను ఆధునీకరించేందుకు రూ.11లక్షలను మంజూరు చేయించడంతో జీహెచ్ఎంసీ అధికారులు పనులు ప్రారంభించారు. అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వరద నీటి పైపులైను పనులు పూర్తైతే ముంపు కష్టాలు తీరుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
వరదనీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. భవిష్యత్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వరదనీరు రోడ్లు, కాలనీల్లో నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటు న్నాం. ఎన్నో రోజుల నుంచి వరద నీటి సమస్య వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వరద ముంపు సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభించనుంది.
-హిమాయత్నగర్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మి
త్వరగా పనులు పూర్తి చేయాలి
వరద నీరు అంతర్గత రోడ్లలో నిలిచిపోవడంతో చాలా ఇబ్బందులు పడేవాళ్లం. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల సమస్యలు పరిష్కారం కాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం దశల వారీగా సమస్యలను పరిష్కరించండం సంతోషకరం. శరవేగంగా పనులను పూర్తి చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలి.
-డి.రాజేందర్ కుమార్(స్థానికుడు)