ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే.. విశ్వాస పరీక్షలో నెగ్గారు. ఇవాళ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో ఆయనకు అనుకూలంగా 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. కొన్ని వారాల నుంచి సాగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ సంక్షోభం అనూహ్య మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. శివసేన రెబల్గా షిండే తిరుగుబాటు చేయడంతో ఉద్దవ్ ఠాక్రే తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఏక్నాథ్ సీఎం అయ్యారు. అయితే ఆయన ఇవాళ బలపరీక్షలో నెగ్గారు. ఇవాళ ఓటింగ్లో ప్రతిపక్షానికి 99 ఓట్లు పోలయ్యాయి. ఎమ్మెల్యేల లెక్కింపు ద్వారా మెజారిటీని తేల్చారు. మెజారిటీ మార్క్ 144 మాత్రమే. అయితే నిన్నటి వరకు ఉద్ధవ్ గ్యాంగ్తో ఉన్న ఎమ్మెల్యే సంతోష్ బంగర్ ఇవాళ బలపరీక్షలో ఏక్నాథ్కు సపోర్ట్ ఇచ్చారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు.