Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి మరోసారి జర్నలిస్టును పరుష పదజాలంతో దూషించారు. సీఎం అనే సోయి మరిచి అసభ్యకరంగా మాట్లాడారు. జర్నలిస్టుల పట్ల కూడా భాషను నియంత్రించుకోలేకపోయారు రేవంత్ రెడ్డి. ఓ రాజకీయ నాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సదరు జర్నలిస్టుపై కోపం చేశారు. ఆయన ఏదో పెద్ద తప్పు ప్రశ్న కూడా అడగలేదు. చంద్రబాబుతో ఉన్న గురుశిష్య బంధం గురించి అడిగేసరికి రేవంత్కు కోపం కట్టలు తెంచుకుంది.
ఎన్టీవీ క్వశ్చన్ అవర్ కార్యక్రమానికి రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్టు రేవంత్ను ఈ విధంగా ప్రశ్నించారు. శిష్యుడి కోసం తెలంగాణలో టీడీపీని పోటీ పెట్టకుండా చంద్రబాబు విరమింపజేశారని, మరి ఇప్పుడు గురువు అక్కడ పోటీ చేస్తున్నారు. సహకారం ఏమైనా అందిస్తారా..? అని జర్నలిస్టు ప్రశ్నించాడు.
ప్రశ్న పూర్తి కాకముందే రేవంత్ రెచ్చిపోయారు. ఎవడయ్యా బుర్ర లేనోడు మాట్లాడేది. శిష్యుడు ఎవరు..? గురువు ఎవరు..? నేను సహచరుడిని అని చెప్పిన. ఎవడన్న బుద్ది లేని గాడిద కొడుకు గురువు, శిష్యుడు అని మాట్లాడితే.. ముడ్డి మీద పెట్టి తంతా.. చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడు. నేను ఇండిపెండెంట్గా గెలిచి ఆ పార్టీలోకి పోయాను. నేను సహచరుడిని మాత్రమే అని రేవంత్ చెప్పారు.
చంద్రబాబు నాయుడు నాకు గురువు కాదు సహచరుడు మాత్రమే
ఎవడైనా చంద్రబాబు నాయుడు నా గురువు.. నేను ఆయన శిషుడు అంటే ముడ్డి మీద తంతా – సీఎం రేవంత్ రెడ్డి
Video Credits – NTV pic.twitter.com/QFNZTd8xOL
— Telugu Scribe (@TeluguScribe) May 7, 2024