హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ రెండు జిల్లాల్లో అధికారిక కార్యక్రమాలతో పాటు, పార్టీ కార్యక్రమాలకు సీఎం హాజరుకానున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వరంగల్ దక్షిణ భాగంలో ఔటర్ రింగ్రోడ్డు, వరంగల్ జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు, వరంగల్, హనుమకొండ జంట నగరాల రవాణా, అభివృద్ధికి అవరోధంగా ఉన్న రైల్వేట్రాక్ల మీద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)ల నిర్మా ణం, తదితర అంశాలపై సమీక్ష జరిపి, మంజూరు చేయనున్నారు. వరంగల్ ఇంటర్నల్ రింగ్రోడ్డు పూర్తిచేసేందుకు చేపట్టాల్సిన చర్యలు, వరంగల్ టెక్స్టైల్ పార్క్ పనుల పురోగతిపైనా సీఎం సమీక్షించనున్నారు. అదే రోజున హనుమకొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.