యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు యాదాద్రి చేరుకొంటారు. అక్కడ వీవీఐపీల విడిది ప్రెసిడెన్షియల్ సూట్ను ప్రారంభిస్తారు. ఆలయ సంప్రోక్షణ సందర్భంగా నిర్వహించనున్న యాగశాల నిర్వహణ స్థలాన్ని పరిశీలిస్తారు. అనంతరం భువనగిరిలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయానికి చేరుకొంటారు. మధ్యాహ్నం 1:05 గంటలకు కలెక్టరేట్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3:15 గంటలకు టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకొని నూతన భవనాన్ని ప్రారంభిస్తారు.
అక్కడి నుంచి 4 గంటలకు రాయిగిరిలోని బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు అక్కడినుంచి ప్రగతి భవన్కు వెళ్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో శుక్రవారం విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, విప్ గొంగిడి సునీత, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్కుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్యతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.