హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగా ణ): తెలంగాణ సాగునీటి రంగ నిపుణుడు దివంగత ఆర్ విద్యాసాగర్రావు గొప్ప జల ఉద్యమకారుడని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కొనియాడారు. విద్యాసాగర్ రావు జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఆయనకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యాసాగర్రావు పోషించిన పాత్ర మరువలేనిదని శ్లాఘించారు. తెలంగాణకు సాగునీటి సోయి నేర్పుతూ, సమైక్యవాదుల జలదోపిడీపై జీవితాంతం పోరాడారని కొనియాడారు.