హైదరాబాద్, జనవరి 26 : రాష్ట్రవ్యాప్తంగా 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, సీఎస్, డీజీపీ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ పరేడ్ గ్రౌండ్లోని అమర జవాన్ల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు.
బీఆర్కేభవన్లో
బీఆర్కేభవన్లో సీఎస్ సోమేశ్కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలు, ఉపకార్యదర్శులు, సచివాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో గణతంత్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. శబరి బ్లాక్ వద్ద తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ జాతీయ పతాకాన్ని ఆవిషరించారు. కార్యక్రమంలో తెలంగాణ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ సమాచార హక్కు కమిషన్ కార్యాలయంలో ప్రధాన కమిషనర్ బుద్దా మురళి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సమాచార హక్కు కమిషనర్లు కట్టాశేఖర్రెడ్డి, మహ్మద్ అమీద్, ఎం నారాయణరెడ్డి, ఖలీలుల్లా పాల్గొన్నారు.