హాజరుకానున్న అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీ అధికారులు
20, 21, 22 తేదీల్లో ఉన్నతాధికారుల అధ్యయనం
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): పోడుభూములపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ నెల 23న ప్రగతిభవన్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్లు, అటవీశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించే ఈ సమావేశంలో అడవుల పరిరక్షణ, హరితహారంపై కూడా విస్తృతంగా చర్చించనున్నారు. సమావేశంలో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్, పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఆయా శాఖల అధిపతులు, కార్యదర్శులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, కన్జర్వేటర్లు, డీఎఫ్వోలు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు పాల్గొంటారు. దీనికంటే ముందు పోడు సమస్యపై అధ్యయనం చేసేందుకు అధికారుల బృందం ఈ నెల 20, 21, 22 తేదీల్లో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నది. ఈ పర్యటనలో అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, పీసీసీఎఫ్ ఆర్ శోభ పాల్గొంటారు.