వనపర్తి, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : లక్షా 50 వేల మందితో వనపర్తిలో సీఎం కేసీఆర్ సభను నిర్వహించనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి పర్యటనకు విచ్చేస్తున్న సీఎంపై ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు ప్రేమను చూపించాలని పిలుపునిచ్చారు. ఈనెల 8న కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మంగళవారం వనపర్తి క్యాంపు కార్యాలయంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అధికారులతో మంత్రి సన్నాహక సమావేశం నిర్వహించారు.
అనంతరం నూతన కలెక్టరేట్, మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్వహించనున్న సభ ఏర్పాట్లను పరిశీలించారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, కలెక్టర్ యాస్మిన్బాషా, ఎస్పీ రంజన్త్రన్కుమార్, టీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.