హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేరును ప్రతిపాదిస్తూ సోమవారం మరో 4 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన తొలిరోజు ఆదివారం కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ 6 సెట్ల నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. దీంతో రెండ్రోజుల్లో మొత్తం పది సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం మహిళా ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మేయర్లు, విప్లు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ, ఎంపీపీల తరపున విడివిడిగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును మహిళా ప్రజాప్రతినిధుల నుంచి ఎమ్మెల్యే హరిప్రియనాయక్ ప్రతిపాదించగా మంత్రులు సత్యవతిరాథోడ్, సబితాఇంద్రారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే రేఖానాయక్, మేయ ర్లు గద్వాల్ విజయలక్ష్మి, గుండు సుధారాణి తదితరులు బలపరిచారు. మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల తరపున జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును ప్రతిపాదించగా మేయర్లు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు గుండు సుధారాణి, పారిజాత తదితరులు బలపరిచారు. విప్లు, ఎమ్మెల్యేల్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును ప్రతిపాదించగా విప్లు రేగా కాంతారావు, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, సురేందర్, మెతుకు ఆనంద్ బలపరిచారు. జడ్పీటీసీలు, ఎంపీపీల నుంచి పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును విజయ్కుమార్ ప్రతిపాదించగా జడ్పీటీసీలు, ఎంపీపీలు బలపరిచారు. ఈ నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, పర్యవేక్షకుడు పర్యాద కృష్ణమూర్తికి సమర్పించారు.