హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్కు బయల్దేరారు. ప్రగతి భవన్లో దసరా పూజల అనంతరం కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ఇతర నేతలతో కలిసి కేసీఆర్ పార్టీ ఆఫీసుకు బయల్దేరి వెళ్లారు. ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ బయటకు రాగానే టీఆర్ఎస్ మహిళా నేతలు పూలతో స్వాగతం పలికారు. ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్ వరకు టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున దేశ్ కీ నేత అని నినాదాలు చేశారు. మరికాసేపట్లో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్కు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు భారీగా చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 1:19 గంటలకు కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించనున్నారు.