సిద్దిపేట, ఫిబ్రవరి 16: సిద్దిపేటలో సీఎం కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నీకి వేళయైంది. సీఎం పుట్టిన రోజును పురస్కరించుకుని సిద్దిపేటలోని ఆచార్య జయశంకర్ స్టేడియం వేదికగా జరిగే టోర్నీని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, ప్రముఖ హీరో అఖిల్ గురువారం ప్రారంభించనున్నారు. మొత్తం 254 జట్లు, నాలుగు వేల మంది ప్లేయర్లు పోటీపడుతున్న ఈ మెగాటోర్నీ మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో జరుగుతున్నది. గతేడాది విజయవంతంగా నిర్వహించిన టోర్నీ స్ఫూర్తితో ఈసారి మరింత ఘనంగా చేపడుతున్నట్లు నిర్వాహకులు వేణుగోపాల్రెడ్డి, మల్లిఖార్జున్ తెలిపారు. సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకల్లో భాగంగా సాయంత్రం నాలుగు గంటలకు కేక్ కట్చేసిన తర్వాత ఆరంభ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకల్లో ప్రముఖ యువ హీరో అక్కినేని అఖిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాడు. టోర్నీలో విజేతకు రూ.లక్ష, రన్నరప్ జట్టుకు రూ.50 వేలు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కింద రూ.25వేలు, మ్యాచ్లో ఒక్కో సిక్స్కు వెయ్యి రూపాయల ప్రైజ్మనీ ప్రకటించారు. 258 జట్లను మొత్తం నాలుగు గ్రూపులుగా విభజించారు.