హైదరాబాద్ : నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక సీఎండీ దీవకొండ దామోదర్రావును సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల దామోదర్ రావు తండ్రి దీవకొండ నారాయణరావు కన్నుమూశారు. ఆ సమయంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గురువారం పర్యటన ముగిసిన తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. ఆ తర్వాత దామోదర్రావు ఇంటికి చేరుకొని దామోదర్రావు, ఆయన తల్లి ఆండాలమ్మను పరామర్శించారు. ఈ సందర్భంగా నారాయణరావుతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. సీఎం వెంట ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, నవీన్రావు, టీఆర్ఎస్ నాయకులు శ్రవణ్రెడ్డి ఉన్నారు.