హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): సబ్బండవర్ణాలు సంతోషంతో జీవించాలని, ఏప్రిల్ 2న ఉగాది పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి ప్రచురించిన శుభకృత్ నామ సంవత్సర నూతన పంచాంగాన్ని సోమవారం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలంతా మానవతా విలువలతో జీవించాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, బ్రాహ్మణ సేవా సమితి గౌరవ అధ్యక్షుడు ఉపేంద్రశర్మ ఉన్నారు.