హైదరాబాద్ : సౌత్ ఆఫ్రికాలో సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. సౌత్ ఆఫ్రికా టీఆర్ఎస్ ఎన్నారై శాఖ ఆధ్వర్యంలో ఓ అనాథాశ్రమంలో అన్నదానం చేశారు.
సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆదేశాల మేరకు.. చారిటీ ఇంచార్జిలు శ్రీధర్ రెడ్డి, అరవింద్ అధ్వర్యంలో మంగళవారం సౌత్ ఆఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ పోలీసులతో కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వచించారు.
సౌత్ ఆఫ్రికా మిడ్రాండ్ (Midrand) పోలీస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. బ్లాంకెట్ డ్రైవ్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసారని పేర్కొన్నారు.
ఈసారి సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా అన్నదానం నిర్వహించడం ఎంతో స్ఫూర్తి దాయకం అని ప్రశంసించారు. ఎంతో మంది అభాగ్యులకు కడుపు నింపుతున్న శాఖకి సౌత్ ఆఫ్రికా Midrand పోలీస్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే సీఎం కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు విష్ణు జై గుండా, శ్రీనివాస్ రేపాల, సౌజన్ రావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.