హైదరాబాద్ : జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్లో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ హరిరామ్ కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ ట్రైకార్ చైర్మన్ రామచంద్రు నాయక్, యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్తో పాటు పలువురు నాయకులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.