అమరావతి : శ్రీకృష్టాష్టమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కర్తవ్య దీక్షను జీవనసూత్రంగా తెలిపిన గీతాచార్యుడు శ్రీకృష్ణుడని ఆయన అన్నారు. ప్రేమ, స్నేహం ధర్మాచరణను బోధించారని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషాధారణలో సందడి చేశారు. అనేక చోట్ల ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనకాపల్లి, అనంతపురం,కర్నూలు, గుంటూరు జిల్లాల్లో వేడుకలను నిర్వహించారు.