మియాపూర్ :కష్టకాలంలో ఉన్న పేదలకు అండగా సీఎం సహాయ నిధి పథకం నిలుస్తూ బాధితులకు భరోసాను ఇస్తున్న దని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ పథకంతో వందలాది మంది పేదలు తమ అనారోగ్యాలకు స్వస్థత పొంది హాయిగా జీవితం గడుపుతున్నారన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా ఆయా డివిజన్లకు చెందిన లబ్దిదారులకు సీఎం సహాయ నిధి పథకం కింద మంజూరైన రూ. 1.21 లక్షల చెక్కులను విప్ గాంధీ బుధవారం వివేకానందనగర్లోని తన నివాసంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు గణేశ్, జిల్లా గణేశ్, ఆదర్ష్రెడ్డి, నాయినేని చంద్రకాంత్రావు, నరేశ్, జగదీశ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.