హుజూరాబాద్ : సీఎం సహాయనిధి నిరుపేదలకు సంజీవని లాంటిదని బీసీ సంక్షేమ ,పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో 15 మంది లబ్దిదారులకు… 3,19,000 రూపాయల విలువజేసే చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా తెలంగాణలో ఏ పథకం కూడా ఆగకుండా… పకడ్భందీగా అమలవుతున్నాయని అన్నారు.
ఆనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న వారు… చికిత్స పేరుతో… అప్పుల ఊబిలో కూరుకుపోకుండా… ఆర్థిక భరోసానిస్తుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓ వైపు కరోనా సంక్షోభంతో… యావత్ ప్రపంచమే స్థంభించిపోయి నప్పటికీ… తెలంగాణలో మాత్రం పథకాలు పకడ్భందీగా అమలవుతున్నాయన్నారు. ఏ పథకం కూడా ఆగకుండా నిరాటంకంగా కొనసాగుతున్నాయన్నారు.
తెలంగాణలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా ఉండాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ… ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందన్నారు. సీఎం సహాయనిధితో… ఎంతోమంది తమ ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నారన్నారు. ప్రజాసంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ గందె రాధిక – శ్రీనివాస్, కొలిపాక నిర్మల – శ్రీనివాస్ లు పాల్గొన్నారు