కీసర, జనవరి 1: సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని భోగారం గ్రామానికి చెందిన గురిజాల బాల్రాజ్గౌడ్ వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు రూ.60 వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును శనివారం మంత్రి నివాసంలో లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందుతుందన్నారు. అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు.అభివృద్ధి , సంక్షేమం పరంగా ఉమ్మడి పాలన లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, స్వరాష్ట్రం సాధించుకున్నాక ప్రజల ఇబ్బందులను సీఎం కేసీఆర్ తొలగించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ నర్సింహా రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.
పీర్జాదిగూడకు చెందిన ఒకరికి…
పీర్జాదిగూడ : వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందని పీర్జాదిగూడ 26వ డివిజన్ కార్పొరేటర్ రాజేశ్వరి పేర్కొన్నారు. డివిజన్కు చెందిన వి.కుమార్, శంకర్నగర్ కాలనీకి చెందిన సయ్యద్ శాఖత్బాబా వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ. 42,500, రూ.17వేల చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను మంత్రి మల్లారెడ్డి ఆదేశాల మేరకు కార్పొరేటర్ లబ్ధిదారులకు శనివారం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు అంజిరెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.