తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో జరుగుతున్న 34వ హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవ కార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ హాజరుకానున్నారు. ఈ నెల 28న ఎగ్జిబిషన్ ముగియనుండగా ఎన్వీ రమణ ప్రసంగిస్తారని పుస్తక ప్రదర్శన కార్యదర్శి కోయ చంద్రమోహన్ ఆదివారం తెలిపారు.