న్యూఢిల్లీ: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూర్టీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కు చెందిన బస్సుపై ఇవాళ జమ్మూలో ఉగ్ర దాడి జరిగింది. సుంజువాన్ ప్రాంతంలో ఈ దాడి జరిగిన సమయంలో బస్సులో 15 మంది సిబ్బంది ఉన్నారు. మరో రెండు రోజుల్లో జమ్మూలో ప్రధాని మోదీ పర్యటన ఉన్న నేపథ్యంలో అక్కడ దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. సుంజువాన్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇవాళ ఇద్దరు జేషే ఉగ్రవాదులు హతం అయ్యారు. ఆ ఎన్కౌంటర్లో ఏఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్పీ పటేల్ ప్రాణాలు కోల్పోయారు.
ఇవాళ తెల్లవారుజామున 4.15 నిమిషాలకు సీఐఎస్ఎఫ్ బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ తర్వాత ఉగ్రవాదులు ఓ ఇంట్లో ఆశ్రయం తీసుకున్నారు. ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి రెండు ఏకే రైఫిళ్లు, శాటిలైట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సాంబా జిల్లాలో మోదీ పర్యటన నేపథ్యంలో జమ్మూలో తీవ్ర స్థాయిలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ఇద్దరు ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కున్నట్లు తేలడంతో అక్కడ ఆపరేషన్ చేపట్టారు.
#WATCH | Two days ahead of PM Narendra Modi’s Jammu visit on April 24, CISF vehicle carrying 15 personnel was attacked by terrorists near the Sunjwan area, earlier today pic.twitter.com/bJpWtXjpKl
— ANI (@ANI) April 22, 2022