అగ్రహీరో చిరంజీవి కరోనా బారిన పడ్డారు. మంగళవారం నిర్వహించిన కొవిడ్ పరీక్షలో ఆయనకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం తాను హోమ్ క్యారంటైన్లో ఉన్నట్లు చిరంజీవి పేర్కొన్నారు ‘అన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ నాకు కొవిడ్ పాజిటివ్గా తేలింది. స్వల్ప లక్షణాలుండటంతో హోమ్ క్వారంటైన్లో ఉన్నా. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నా. కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలో అందరి ముందుకొస్తా’ అని అని చిరంజీవి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. చిరంజీవితో పాటుగా మరో సీనియర్ హీరో శ్రీకాంత్ కరోనా బారిన పడ్డారు.